నయనతార-త్రిషల గొడవపై నయనతార మాత్రం కామ్గా ఉండిపోయింది. కానీ త్రిష మాత్రం ఇప్పటికే రెండుసార్లు స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ, వృత్తిపరంగా తప్ప వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యా ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేసింది.
తామిద్దరం మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చింది. సినిమాల దగ్గరకి వచ్చేసరికి కొంత సమస్య వచ్చిందే కానీ.. ఆ సమస్యను కూడా స్నేహితుల ద్వారా పరిష్కరించుకున్నామని చెప్పింది. ప్రస్తుతం తామిద్దరం ఎక్కడ కలిసినా మంచి ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే కొందరు లేని పోని పుకార్లు పుట్టించడం ద్వారానే మా మధ్య దూరం పెరిగిందని త్రిష వెల్లడించింది.