అగ్రనటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత

సోమవారం, 10 జూన్ 2019 (10:41 IST)
దక్షిణాది అగ్రనటుడు గిరీశ్ కర్నాడ్ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో సోమవారం ఉదయం 6.30 గంటలకు కన్నుమూశారు. 81 సంవత్సరాల వయస్సులో అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారని ఆయన కుటుంబీకులు వెల్లడించారు. 
 
తెలుగులో గిరీశ్ కర్నాడ్ ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు తదితర చిత్రాల్లో నటించారు. 1972లో గిరీశ్ కర్నాడ్ కు బీవీ కారంత్ తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. 
 
మహారాష్ట్రలోని మాతేరన్‌లో 1938 మే 19న జన్మించిన గిరీశ్ కర్నాడ్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. పరిస్థితి విషమించి సోమవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ జిందా హై' చిత్రంలో రా చీఫ్‌గా నటించారు. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పలువురు ఆయన మృతిపట్ల ఆయన కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు