శ‌రణ్ కుమార్ నటించిన సాక్షి రిలీజ్ డేట్ ప్రకటించిన వి.వి.వినాయక్

శుక్రవారం, 30 జూన్ 2023 (19:19 IST)
Sharan Kumar, nagababu
సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శ‌రణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా ప‌రిచయం కాబోతున్న సినిమా 'సాక్షి'. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఇది వరకు విడుదల చేసిన సినిమా పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్, విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌, సినిమా టీజర్‌లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 
 
 *తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..* 'విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి వెనకాల ఉండి ఆర్.యు.రెడ్డి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ మూవీతో శరణ్‌కు మంచి పేరు రావాలని, కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్న శివకు ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 
 *ఆర్.యు.రెడ్డి మాట్లాడుతూ..* 'నా ఆప్తుడు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు ధన్యవాదాలు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ చిన్న సినిమాకు పెద్ద మనసు చేసుకుని వచ్చారు. ఆయన ఈవెంట్‌కు రావడమే మొదటి విజయం. మీడియా సహకారం మా టీంకు ఉండాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 
 *నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..* 'సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ గారికి ధన్యవాదాలు. జూలై 21న సినిమా విడుదల కాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయాల'ని అన్నారు.
 
 *హీరో శరణ్ మాట్లాడుతూ..* 'సాక్షి సినిమా రిలీజ్ డేట్‌ను వి.వి.వినాయక్‌ గారు రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మీడియా, ప్రేక్షకుల సహకారం కావాల'ని అన్నారు.
 
 *దర్శకుడు శివ మాట్లాడుతూ..* 'టీం అంతా సహకరించింది. భీమ్స్ మంచి సంగీతాన్ని అందించారు. హీరో శరణ్ ఎంతో చక్కగా నటించారు. మా సినిమా జూలై 21న రాబోతోంది. అందరి సహకారం కావాల'ని కోరారు.
 
ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని   ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్ సినిమాలకు సంగీతమందిస్తున్న భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. సాక్షి సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు