తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొడతారు : ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు

మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:57 IST)
సినీ హీరో ప్రకాష్ రాజకీయ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్‌ను చూపిస్తా' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. గత కొన్ని రోజులుగా చారిత్రక కట్టడం తాజ్ మహల్‌పై పలువురు పలు రకాలైన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా ట్వీట్ చేశాడు. 
 
అంతకుముందు చేసిన మరో ట్వీట్‌లో 'ప్రశ్నించడం కొనసాగిస్తా. ఇది నా ప్రాథమిక హక్కు... నేను వ్యక్తపరిచిన భావాలను విభేదించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. నాపై ఎవరైతే అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారో వారి పదజాలం చాలా అసహ్యం కల్గిస్తోంది. మీరు చేసే ప్రతి దూషణ కారణంగా నా భావాలను మరింత దృఢంగా చెప్పే శక్తి నిస్తుంది..' అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు