- మన ప్రపంచ సినిమాతో పోటీ పడుతున్నపుడు రిచ్నెస్ చూపించాలి. చాలా మంది హీరోలు 20 నుంచి 30శాతం రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్బాబు, ఎన్.టి.ఆర్. ప్రభాస్, వరుణ్ తేజ్ ఇలా ఎంతో మంది సినిమా ఆడకపోతే వారు తమ పారితోషింకాన్ని తగ్గించుకున్నారు. అత్తారింటికి దారేది సినిమాను ఓ మూర్ఖుడు పైరసీ చేస్తే నిర్మాతకు నష్టం వాటిల్లింది. వెంటనే కళ్యాణ్బాబు తన పారితోషికంతో కొంత వెనక్కి ఇచ్చేశాడు. ఇలా చాలా ఉదంతాలు వున్నాయి.
- చైనా, రష్యా అధ్యక్షులుగా శాశ్వతంగా ప్రభుత్వాలను రాష్ట్రంలో పాలించలేరు. కొద్దికాలమే. శాశ్వతంగా వై.సి.పి. వుండదు. అలా వుండకూడనే అప్పట్లోనే గ్రహించి ఐదేళ్ళకోసారి ఎలక్షన్ లు జరగాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. అంటూ ఘాటుగా స్పందించారు నాగబాబు.