‘రెడ్డిగారింట్లో రౌడీయిజం`లోని పాటను విడుదల చేసిన వై.ఎస్.షర్మిల

బుధవారం, 24 మార్చి 2021 (16:35 IST)
YS Sharmila
ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బుధవారం ఈ సినిమాలో ‘అలలాగా మ‌న‌సే ఎగిసెనే...’ పాటను వై.ఎస్.షర్మిల విడుదల చేశారు. సినిమా పెద్ద విజయం సాధించాలని దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని, రమణ్ హీరోగా మంచి రేంజ్ చేరుకోవాలని ఎంటైర్ యూనిట్‌ను వై.ఎస్.షర్మిల అభినందించారు.
 
మహిత్ నారాయణ్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో ఈ పాటను బాలాజీ రాశారు. యాజిన్ నజిర్ పాట పాడారు.ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘వై.ఎస్.షర్మిలగారు మా సినిమాలో అలలాగా మనసే ఎగిసెనే...’ అనే పాటను విడుదల చేయడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. షర్మిలగారికి మా ఎంటైర్ యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా విషయానికి వస్తే  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని’’ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు