'నువ్వు మాల, మాదిగ? మీ అయ్య ఏం పనిచేస్తాడు?' ప్రయాణికుడికి వర్ల రామయ్య షాక్ (Video)

శుక్రవారం, 11 మే 2018 (08:10 IST)
ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ ప్రయాణికులకు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనను పట్టించుకోని ఓ ప్రయాణికుడిని చీవాట్లు పెట్టారు. అంతేనా నీదేం కులం.. మీ అయ్య ఏం చేస్తుంటారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వర్ల రామయ్యగారు ఆకస్మిక తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఇదేమీ పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది గమనించిన వర్ల రామయ్య ఆ ప్రయాణికుడి కులం గురించి అడిగి తెలుసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
'బస్సు ఎక్కాం.. దిగాం.. వాడు మాత్రం మనను చూడలేదు. అది డేంజర్.. వాళ్ల నాన్నకు వీడేమీ ఉపయోగపడడు..' అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడి వద్దకు వెళ్లి 'నువ్వు మాల, మాదిగ?' అని ప్రశ్నించారు. 'మీ అయ్య ఏం పనిచేస్తాడు? మీ అమ్మ? ఎన్ని ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి. మరి ఎట్లా చదువుకుంటావు? కష్టపడాలి.. ఫోన్‌లో పాటలు వినడం కాదు' అని మందలించారు.

 

#Andhra-Pradesh RTC chairman V Ramaiah chides a passenger, says #madigas don't study well @NewIndianXpress pic.twitter.com/SrIBZYK4II

— kalyan chakravarthi (@Kalyan_TNIE) May 10, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు