కాబూల్ విమానం నుంచి ఖతార్‌కు శరీర భాగాలు

బుధవారం, 18 ఆగస్టు 2021 (13:07 IST)
కాబూల్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు.. పరుగులు తీస్తున్న విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. టర్మాక్‌పై కూర్చుకున్న కొందరు విమానం గాల్లోకి ఎగిరన తర్వాత కింద పడ్డారు. ఆ దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి.
 
అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానంపై ఎక్కిన కొందరు దాన్ని వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందితో వెళ్లిన ఆ విమానం ఖతార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. కానీ ఆ విమానం అక్కడ దిగిన తర్వాత వైమానిక దళ సభ్యులకు మరో షాక్ తగిలింది. విమాన చక్రం (వీల్) భాగంలో మానవ శరీరభాగాలు, అవయవాలు కనిపించినట్లు వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
 
సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్షణాల్లోనే వందలాది మంది వచ్చి ఎలా దాన్ని ఆక్రమించారో తెలియదని అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది. గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం సరుకును దించకముందే.. ఆ విమానాన్ని వందలాది మంది చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు.
 
అయితే పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు తేలడంతో.. తక్షణమే సీ-17 విమానాన్ని అక్కడ నుంచి తరలించినట్లు ఆ ప్రకటనలో చెప్పారు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం చెప్పింది. విమానాశ్రయం వద్ద ఏర్పడ్డ గందరగోళంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎంతమంది మృతిచెందారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు