సుందర్ పిచాయ్ @ Rs 13.5 కోట్లు ఏడాదికి... ఎలా ఎదిగారు?

బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (21:53 IST)
1993లో స్టాన్‌ఫర్డ్‌లో ఎంఎస్ చేయడానికి చేరారు సుందర్ పిచాయ్. ఆ తర్వాత అప్లైడ్ మెటీరియల్సులో ఉద్యోగం చేశారు. 2002లో వార్టన్లో ఎంబీఎ, ఆపైన మెకన్సీలో కన్సల్టెంటుగా పనిచేశారు. 2004లో ఏప్రిల్ 1న గూగుల్ సంస్థలో చేరారు. 
 
10 మంది ఇంజనీర్ల బృందంతో కలిసి వెబ్ బ్రౌజర్ క్రోమ్‌ని డెవలెప్ చేశారు. 2008లో వచ్చిన క్రోమ్ ఇప్పుడు అత్యధికంగా వాడుతున్న సెర్చింజిన్. 2013 నుంచి ఆండ్రాయిడ్ బాధ్యతల్ని తీసుకున్నారు. తర్వాత గూగుల్ బిజినెస్‌లో ప్రొడక్ట్, ఇంజినీరింగ్ విభాగాలను చూసేవారు.
 
2015 నవంబరులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లలో సంస్థ ఆదాయాన్ని సుమారుగా 5.2 లక్షల కోట్ల నుంచి 9.5 లక్షల కోట్లకు పెంచారు. మార్కెట్ విలువనీ దాదాపు రెట్టింపు చేశారు. 
 
2019 డిసెంబరు 3న ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఒకప్పటి గూగుల్( క్రోమ్, ఆండ్రాయిడ్, యూ ట్యూబ్)తో పాటు వేమో(సెల్ఫ్ డ్రైవింగ్ కార్) క్యాలికో(వైద్య పరికరాల విభాగం), వింగ్(డ్రోన్ డెలివరీ సర్వీస్) సహా పలు విభాగాలు ఆల్ఫాబెట్లో వున్నాయి. 
 
ప్రస్తుతం సుందర్ పిచాయ్ వార్షిక వేతనం అన్ని అలవెన్సులు కలుపుకుని రూ. 13.5 కోట్లు. 2016లో ఆయన వార్షిక జీతం రూ. 4.7 కోట్లు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు