డ్రై బ‌నానా... లాక్ డౌన్ వేళ ఓ రైతుఅద్భుత సృష్టి! (video)

శనివారం, 10 జులై 2021 (23:17 IST)
లాక్ డౌన్ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రైత‌న్న‌ల‌కు త‌మ దిగుబ‌డులు స‌రిగా ర‌వాణా కాక‌, అమ్ముడు కాక‌... చాలా న‌ష్టాల‌ను చ‌విచూశారు. కానీ, కొంచెం ఆలోచిస్తే, కొండంత ఫ‌లితం అన్న‌ట్లు... ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. డ్రై బ‌నానా త‌యారు చేశాడు.
 
తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు... క‌ర్నాట‌క‌లోని ఒక రైతు. డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్ష.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన_అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు.
 
బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన కె.గంగాధర్​ ఓసాధారణరైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​.
 
కానీ, మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు. విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్. భారత్​లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో....అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేస్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.
 
ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని.. ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే... ఈ డ్రై_బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్​.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు