మ్యాగీ నూడుల్స్‌ ప్లేట్‌ రూ.193 : దేవుడా.. ఇంధనంతో మ్యాగీ చేసి వుంటారా?

మంగళవారం, 18 జులై 2023 (19:49 IST)
మ్యాగీ నూడుల్స్‌ ఇంటికి తెచ్చుకుంటే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అదే బయట తింటే ఒక ప్లేటు వంద రూపాయల్లోపు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అయితే ఓ మహిళకు విమానాశ్రయంలో ఒక మ్యాగీ కప్ ఆర్డర్ చేసిన పాపానికి కళ్లు బైర్లు కమ్మాయి. 
 
విమానాశ్రయంలో మ్యాగీ ఆర్డర్​ ఇచ్చిన ఆమె.. బిల్లు చూసి షాక్​ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సాజెల్ అనే మహిళ విమానాశ్రయంలో మ్యాగీ ఆర్డర్ చేసింది. దాని ధర రూ.193. ఈ బిల్లు చూసి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. 
 
మ్యాగీని కూడా ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 
 
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం అంటే ఇదేనేమో అని కొంతమంది ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టులో కాబట్టి విమానాలకు వాడే ఇంధనంతో మ్యాగీ చేసి ఉంటారని పలువురు కామెంట్లు పెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు