చిరు 152, 'రంగస్థలం' రంగమ్మత్తను వదలని రామ్ చరణ్... ఏంటి సంగతి?

మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:29 IST)
సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న చిరంజీవి అభిమానులకి మరో పండగ గిఫ్ట్ ఇచ్చేశారు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
చిరంజీవి నటించనున్న ఈ 152వ సినిమా ఓపెనింగ్‌కి చిరంజీవి భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరు తల్లి అంజనా దేవి, కుమారుడు నిర్మాత రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. 
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. 
 
ఇక ఈ సినిమాలో చరణ్ కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటనలు ఏవీ లేకున్నా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ పాత్ర ఉంటుందని అంటున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం అని చెప్తున్నారు. ఇందులోనే చిరంజీవి, చరణ్ కలిసి నటించబోతున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో రంగస్థంలో చెర్రీకి అత్తగా నటించిన హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు