మురళీ మోహన్ నన్ను కెలికారు... ఆయన ప్రసాదం ఆయనకు పెట్టేస్తా.. శ్రీరెడ్డి

శనివారం, 22 సెప్టెంబరు 2018 (17:24 IST)
ఈమధ్య శ్రీరెడ్డి ఏ టీవీ ఛానల్లో కానీ ఏ యూ ట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో కానీ కనిపించడం లేదు కానీ ఫేస్ బుక్ లైవ్‌లో మాత్రం వస్తూనే వున్నది. ఆమధ్య పలువురు కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన విమర్శనాస్త్రాలు సంధించింది. ఐతే హఠాత్తుగా నటుడు, పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ పైన ఆరోపణాస్త్రాలు సంధించింది. 
 
తనను మురళీ మోహన్ కెలికారనీ, ఆ జిల్లా ఈ జిల్లా తిరిగి వందల కోట్లు సంపాదించారంటూ ఆరోపణలు చేసింది. తెదేపాలో మీరు కలుపు మొక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ''రాజమండ్రిలో మీరు మళ్లీ రావడం కల్ల... రాసి పెట్టుకోండి. బుద్ధి వున్నవాళ్లు ఎవరూ మిమ్మల్ని సపోర్ట్ చేయరు. మూవీ ఇండస్ట్రీకి మీరేం చేశారు. సంపాదన మీద మీకు ధ్యాస. నన్నిలా టార్చర్ చేస్తే హిమాలయాలకు వెళ్లిపోతా. నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు'' అంటూ అకస్మాత్తుగా వేదాంతం కూడా మాట్లాడేసింది.
 
కత్తి మహేష్, మూర్తి చెబితే నేను బట్టలు ఊడదీసుకుంటానా? నేను రాజకీయాల్లోకి వస్తే ఒక్కొక్కడి తాట వలుస్తా... నేను రాజకీయాల్లోకి రావాలంటే స్వతంత్రంగా వస్తా, ఎందుకు మీడియా సంస్థలకు దూరంగా వుంటున్నానో మీకు తెలుసా... మళ్లీ నేను వస్తే వాళ్ల తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు