మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్‌లు.. వధూవరులు ఫిదా

బుధవారం, 11 ఆగస్టు 2021 (12:55 IST)
flower
కరోనా కాలంలో ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. బిజినెస్ లేకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. కానీ కొంతమంది స్మార్ట్‌గా ఆలోచిస్తూ.. వ్యాపారాన్ని లాభాల బాటలోకి తెచ్చుకుంటున్నారు. కరోనా కారణంగా.. మాస్క్, శానిటైజర్స్, ఫేస్ మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు కొన్ని నియమనిబంధనల మధ్య జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో సంతోషంగా గడుపుకోవాలని అనుకున్న వధూవరులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
 
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్…చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్ లను తయారు చేశాడు. వధూవరుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మాస్క్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. 
 
మూడు పొరల ముసుగులో మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్‌లు తయారు చేశారు. కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్క్ తయారు చేశానని అంటున్నారు మోహన్. ఫ్లవర్ మాస్క్ లకు ఆర్డర్స్ వస్తున్నట్లు, పూల మాస్క్ ధరించిన వధూవరులు చూడటానికి అందంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు