మొసలితో మాట్లాడిన వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్

బుధవారం, 27 జనవరి 2021 (14:39 IST)
crocodile
మొసలిని వేధించినందుకు గుజరాత్​ వడోదరలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్జన్​ చెరువు ఒడ్డున ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న మొసలి వద్దకు వెళ్లి ముట్టుకొని దాని ప్రశాంతత చెడగొట్టిన కారణంగా అతడిపై కేసు నమోదు చేశారు. 
 
నీటి ఒడ్డున ఉన్న మొసలి దగ్గరకు వెళ్లిన పంకజ్ పటేల్ అనే వ్యక్తి దానికి దండం పెట్టి అనంతరం ముచ్చట్లు చెప్పాడు. ఈ వీడియో వైరల్​ కావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఖొడియార్ దేవత ప్రతిరూపమనే ఉద్దేశంతో తాను మొసలిని తాకానని, అది తన కల అని పంకజ్ పోలీసులతో చెప్పాడు. ఆ దేవత వాహనం మొసలి. 
 
'సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవగానే.. వన్య ప్రాణాల రక్షణ చట్టం కింద పంకజ్ పటేల్​పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం' అని వడోదర ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ కార్తిక్ మహారాజ్ తెలిపారు. ఈ ఘటన కర్జన్ చెరువు ఒడ్డున జరిగిందని వెల్లడించారు.
 
ఆ వీడియోలో. మొసలి అతి సమీపానికి పంకజ్ పటేల్ వెళ్లినట్టు స్పష్టంగా ఉంది. ఆయన దాన్ని ముట్టుకొని దండం పెట్టి మాట్లాడాడు. ప్రాణాలకు ఏ మాత్రం భయపడకుండా సాహసం చేశాడు. ప్రజల నుంచి కాపాడతానని మొసలితోనే చెప్పాడు. అక్కడి వారు ఎంత చెప్పినా పంకజ్ మొసలి నుంచి దూరంగా రాలేదు. ​ మొసలి మరింత సమీపించాడు. 
 
ఖొడియార్ దేవత అంటూ దాన్ని చాలా సార్లు ముట్టుకున్నాడు. అయితే అతడి అదృష్టం బాగా ఉండి.. ఆ మొసలి ఏమీ అనలేదు. కనీసం బెదిరించకుండానే చెరువులోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు