అలాగే విరిగిపోయిన, చిరిగిపోయిన ఫోటోలను, ప్రతిమలను మనం పూజ గదిలో ఉంచకూడదు. అలా పగిలిపోయిన వాటిని వెంటనే పారే నీటిలో వేయాలి.
అదే విధంగా ప్రతి ఇంట్లో సీతారాముల ఫోటో, పార్వతి పరమేశ్వరుల ఫోటో, లక్ష్మీ నారాయణుల ఫోటో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోటోలను పూజ గదిలో ఉంచుకోవడం వల్ల భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు.
మన పూజ గదిలో లక్ష్మీ దేవి నిలబడి ఉన్న ఫోటోను కానీ, లక్ష్మీ దేవితో పాటు గుడ్లగూబ నిలబడి ఉన్న ఫోటోను కానీ పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు ఉన్న ఫోటోను మాత్రమే పూజ గదిలో ఉంచుకోవాలి. ఈ ఫోటోకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయాలి.