తయారు విధానం:
ఇడ్లీ పిండిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యం, మినపప్పు, శెనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. బియ్యంతో పాటు మినప, శెనగపప్పు, పచ్చిమిర్చిని చేర్చి మెత్తగా గాకుండా రవ్వలా రుబ్బుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండిని రెండు లేదా మూడు గంటలకు ముందే ఈ పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 20 నిమిషాల పాటు ఉడికిస్తే వెజ్ ఇడ్లీ రెడీ.. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీ గుడ్ కాంబినేషన్.