ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం...

బుధవారం, 28 నవంబరు 2018 (11:33 IST)
ఒట్టి బియ్యం పిండి ఇడ్లీలైతే చిన్నారుల నుండి పెద్దల వరకు వాటిని తినాలంటే విసుగుగా చూస్తుంటారు. అందుకు ఏం చేయాలో తెలియక స్త్రీలు ఆందోళన చెందుతుంటారు. ఓట్స్ అంటే నచ్చని వారుండరు. కాబట్టి వారికి నచ్చిన రీతిలోనే ఓట్స్‌తో ఇడ్లీ చేసిస్తే.. తప్పకుండా తింటారు. మరి ఆ వంట ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
ఓట్స్ - 2 కప్పులు
పెరుగు - అరలీటర్
ఆవాలు - 2 స్పూన్స్
సెనగ పప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
పచ్చిమిర్చి - 2
క్యారెట్ తురుము - 1 కప్పు
కొత్తిమీర తరుగు - అరకప్పు
పసుపు - కొద్దిగా 
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో ఓట్స్ వేసి గోధుమ రంగు వచ్చేవరకూ నూనె లేకుండా వేయించుకోవాలి. ఆ తరువాత పొడి చేయాలి. అదే బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేగించి.. ఆ తరువాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, పసుపు కలిపి 3 నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పొడి చేసిన ఓట్స్, పెరుగు వేసి ఇండ్లీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ల కలపకూడదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండి నింపి ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే... వేడి వేడి ఓట్స్ ఇడ్లీ రెడీ.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు