కావలసిన పదార్థాలు : క్యాబేజి సన్న తరుగు - 2 కప్పులు గోధుమపిండి - 3 కప్పులు పెరుగు - అరకప్పు ఉప్పు - రుచికి తగినంత పచ్చిమిర్చి సన్న తరుగు (గింజలు లేకుండా) : 1 టీ స్పూను అల్లం తరుగు - 1 టీ స్పూను కరివేపాకు తరుగు - అరకప్పు ఉల్లి తరుగు - అరకప్పు నెయ్యి - కాల్చడానికి సరిపడా ఉప్పు - రుచికి తగినంత
తయారు చేయు విధానం : ఒక పాత్రలో క్యాబేజీతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత పరొటాలు చేసుకుని పెనంపై రెండువైపులా నెయ్యి రాస్తూ దోరగా కాల్చుకోవాలి. మంటని కాస్త తగ్గించి ఎక్కువసేపు పెనంపైన ఉంచితే కూరగాయ ముక్కలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి. ఈ పరొటాలు టమోటో చట్నీతో బాగుంటాయి.