గణనాధునికి కుబేరుడి విందు!

WD
సిరిసంపదలతో తులతూగిన కుబేరునికి సంపద ఉందనే మిడిసిపాటు విర్రవీగుతూ.. ఓ సారి బాల వినాయకుడిని తన ఇంటికి విందుకు పిలుస్తాడు. కుబేరుడి విందుకు వచ్చిన బాల వినాయకుడు పదార్థాలన్నింటిని ఆరగించేస్తాడు.

తినడానికి ఇంకేమీ మిగలకపోవడంతో చివరకి వస్తుసామాగ్రిని, అలవికాని ఆకలితో అలకాపురిని కూడా మింగేసే ప్రయత్నం చేయబోతాడు.

దీంతో బెంబేలెత్తిన కుబేరుడు ముక్కంటిని ఆశ్రయించి, బాలగణనాథుడి ఆకలి తీర్చేందుకు మార్గం చెప్పాల్సిందిగా ప్రార్థిస్తాడు. కుబేరుడిని ప్రార్థనమేరకు గణపతి ఆకలితీర్చేందుకు శివుడు కొన్ని గింజలు ఇచ్చి పంపుతాడు.

వాటిని తీసుకెళ్లి కుబేరుడు వినాయకుడికి పెడతాడు. దాంతో వినాయకుని ఆకలి తీరిపోతుంది. దీనిని బట్టి భక్తి ప్రపత్తులతో, ప్రేమతో విఘ్నేశ్వరుడిని అర్చించాలే తప్ప అహంకారంతో కాదన్న విషయాన్ని మనమందరూ గ్రహించాలి. అందుచేత వినాయకుడిని తమకు వీలైనంత నైవేద్యమును భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే.. ఆ స్వామి భక్తులకు అనుగ్రహిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి