ఫ్రిడ్జ్‌‌లో వుంచకూడని పదార్థాలు.. వంకాయలు, బ్రెడ్‌, కెచప్‌లు వుంచితే..?

శనివారం, 24 ఏప్రియల్ 2021 (17:21 IST)
ఫ్రిడ్జ్‌ల ద్వారా శీతలీకరణ అనేక రకాలైన ఆహార పదార్థాలపై చెడిపోవడాన్ని తగ్గిస్తుంది. అయితే వంటగదిలోని ప్రతి తినదగిన పదార్థాన్ని ఫ్రిజ్‌లో వుంచకూడదు. శీతలీకరణ ఉష్ణోగ్రతలు అనేక ఆహార పదార్థాల ఆకృతిని, రుచిని మరియు కొన్నిసార్లు పోషక విలువలను కూడా మార్చగలవు. కాఫీకి వీలైనంత తాజాగా ఉండటానికి పొడి, చల్లని ప్రాంతం అవసరం. 
 
రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలు సాధారణంగా చాలా చల్లగా ఉంటాయి. కాఫీ పొడిని కాఫీని ఫ్రిజ్‌లో వుంచకూడదు. ఒకవేళ వుంచాలనుకుంటే అధిక నాణ్యతను నిలుపుకోవటానికి కాఫీ కూడా ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉండాలి. నేషనల్ కాఫీ అసోసియేషన్ కాఫీ గింజలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి వేడి, తేమ, కాంతికి దూరంగా ఉంచాలని పేర్కొంది. 
 
చల్లని ఉష్ణోగ్రతలు అనేక వస్తువులపై ఎండబెట్టడం ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే బ్రెడ్‌ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.  బ్రెడ్ అనేది రిఫ్రిజిరేటర్‌లో వుంచితే చేస్తే ఎండిపోతుంది. చల్లటి వాతావరణంలో చాలా సేపు ఉంచితే బ్రెడ్ కూడా ఆకృతిలో నమిలేలా మారిపోతుంది. 
 
తులసిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఇతర వాసనలను గ్రహించే ధోరణిని కలిగి ఉంటుంది. శీతలీకరణ తులసి యొక్క రుచి శక్తిని నాశనం చేయడమే కాదు, ఆకులు ఎండిపోతాయి. వంకాయలను ఫ్రిజ్‌లో వుంచకూడదు. వంకాయలతో పాటు సున్నితమైన కూరగాయలు ఫ్రిజ్‌లో వుంచకపోవడం మంచది. చాలాకాలం వుంచిన వంకాయలను వాడటం మంచిది కాదు. వీటితో అవకొడో, వెల్లుల్లి, అల్లం, తేనెను ఫ్రిజ్‌లో వుంచకూడదు. 
Bread
 
అంతేగాకుండా పీనట్ బటర్, కెచప్‌లు, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ పండ్లు, బొప్పాయి, బంగాళాదుంపలు, ఊరగాయలు, వెనిగర్, బేకరీ పదార్థాలు, చీజ్, తునా చేపలు, అరటి పండ్లు, చాక్లెట్లు, దోసకాయలు, ధాన్యాలు, గుమ్మడి కాయలు, పుచ్చకాయ, ఆపిల్స్, కారపు వస్తువులు, పచ్చిమిర్చిలను ఫ్రిజ్‌లో వుంచకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు