కామన్వెల్త్ క్రీడలు: భారత్‌ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు

కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు చేరాయి. దీంతో భారత్ ఖాతాలో బంగారు పతకాల సంఖ్య 26కు చేరుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిథ్యం ఇస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తూ పతాకలను కొల్లగొడుతున్న విషయం తెల్సిందే.

ఇందులోభాగంగా ఆదివారం ఉదయం సెంట్రల్ ఫైర్ ఫిస్టల్ 25 మీటర్ల విభాగంలో భారత్ తరపున బరిలోకి దిగిన హర్‌ప్రీత్ సింగ్ స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, విలువిద్యలో వ్యక్తిగత రీకర్వ్ విభాగంలో భారత్ క్రీడాకారిణి దీపికా కుమారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి