నిరాశ పరిచిన గగన్: భారత్‌కు రెండు రజత పతకాలు!

PTI
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డెన్ బాయ్ గగన్ నారంగ్ నిరాశపరిచాడు. మంగళవారం జరిగిన షూటింగ్ విభాగ పోటీల్లో గగన్ నారంగ్ ధీటుగా రాణించలేకపోయాడు. ఫలితంగా షూటింగ్ విభాగంలో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే హీనా సిద్ధు మరియు అను రాజ్ సింగ్‌లు మెరుగ్గా రాణించి పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిపెట్టారు.

అలాగే సమ్రేష్ చంద్రశేఖర్ కుమార్ చౌదరిలు 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ విభాగంలో రజత సాధించారు. అలాగే 50 మీటర్ల విభాగంలో తేజస్విని సావంత్ వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా.. షూటింగ్ విభాగంలో స్కాట్లాండ్‌కు చెందిన స్టిర్టోన్ (592), జోనాథన్ హమోద్ (589)లు 1181 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి