వైఎస్ఆర్ మృతికి యమగండమే కారణమా!

FILE
కీర్తిశేషులు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంటినుంచి బయలుదేరిన సమయం సరిగా లేకపోవటంవల్లే ప్రమాదం జరిగిందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలో ప్రారంభమయ్యే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ గత బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్ళారు. ఆయన బయలుదేరి వెళ్ళిన కొద్ది గంటలలోపే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో నలుగురు మృత్యువాత పడ్డ విషయం విదితమే.

కాని ఆయన బయలుదేరిన సమయంలో శనిహోర జరుగుతోందని జ్యోతిష్యులు చెపుతున్నారు. దీంతోపాటు యమగండం ఉండటం కారణంగానే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని జ్యోతిష్యులు చెప్పారు.

అలాగే ఆయన నివసిస్తున్న క్యాంప్ కార్యాలయంలో కూడా కొన్ని వాస్తు దోషాలున్నాయని వాస్తు నిపుణులు భావిస్తున్నారు.

జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ఇంటి వాస్తు వంటివి ఖచ్చితంగా నిజమవుతాయని ఎంతోమంది విషయంలో అవి నిరూపించబడ్డాయని పలువురు పండితులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి