దేశంలోని బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. తాజాగా వరుస సెలవులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాదారణ సెలవు, సోమవారం ముస్లింల పండుగ మిలాద్ నబీ కావడంతో బ్యాంకులకు సెలవు.
ఇకపోతే.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు అనంతరం ఈ రోజుకాకుంటే రేపైనా కరెన్సీ కష్టాలు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే నోట్లును రద్దుచేసి 30 రోజులు పూర్తి అయినప్పటికీ కరెన్సీ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. గోరుచుట్టుపై రోకలి పోటు చందాన బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిపడ్డాయి.