కరోనా ఏపీని కూడా తాకింది. ఏపీలో మూడు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఈ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు వున్నారు. వీరిలో వృద్ధుని పరిస్థితి విషమంగా వుందని.. వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు.
ఇకపోతే దేశంలో మేనెలలో కరోనా కేసులు పెరిగాయి. కేరళ, మహారాష్ట్రలో ఈ కరోనా కేసులు అధికంగా వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెల 26నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.