ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా

శనివారం, 8 సెప్టెంబరు 2018 (09:56 IST)
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో తీసుకుని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా. లండన్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. ఈయన జల్సాలు మాత్రం ఏమాత్రం తగ్గించుకోలేదు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌‌లను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
 
తాజాగా లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో దర్శనమిచ్చాడు. మ్యాచ్‌ను తిలకించేందుకు స్టేడియం లోపలికి వస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనను కలిసేందుకు గతంలో మాల్యా ప్రయత్నించగా, భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో మ్యాచ్ చూసుకుని వెళ్లిపోయాడు. తాజాగా మరోమారు మ్యాచ్‌కు వచ్చి కలకలం రేపాడు. ఇంగ్లండ్ నుంచే తన వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న మాల్యాను దేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు