సదా ప్రధాన పాత్రలో రాజేంద్రసింగ్బాబు దర్శకునిగా తెరకెక్కిన చిత్రం మోహిని. ఈ చిత్రంలో హంసనందిని మరో కథానాయకగా నటిస్తోంది. సెన్సేషనల్ మూవీస్ పతాకంపై గోగినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మసాజ్ సెంటర్ల పేరుతో నగరాల్లో సాగుతున్న కొన్ని వికృతాలను వెలుగులోకి తెచ్చే పాత్రలో సదా ఇందులో నటిస్తోంది. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని నిర్మాత చెబుతున్నారు.
సుహాసిని, నాజర్లు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మీకోసం.