స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ కుమార్.. పుళల్ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. రామ్ కుమార్ పోస్టు మార్టం రిపోర్ట్ కోసం అందరూ వేచి చూస్తున్న నేపథ్యంలో.. పోస్టు మార్టం కేసుపై చెన్నై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక స్వాతి హత్య కేసుకు సంబంధించి జైలులో ఉన్న రామ్ కుమార్ మృత దేహం ప్రస్తుతం జీహెచ్లో ఉంది.
ఈ సందర్భంగా రామ్ కుమార్ తరపు న్యాయవాది శంకర సుబ్బు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా రామ్ కుమార్ మృతిలో అనుమానాలున్నాయని.. అతడు హత్యకు గురైవుంటాడని తెలిపారు. రామ్ కుమార్ నోట కొరికినట్లు చెప్పబడుతున్న విద్యుత్ తీగ 220 వాట్ల మాత్రమే కలిగివుందని.. ఆ వాట్ల సామర్థ్యంలో రామ్ కుమార్ మృతి చెందే అవకాశం లేదన్నారు. పోలీసులే హింసించి రామ్ కుమార్ను చంపేశారని ఆరోపించారు.