తీహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హత్య

మంగళవారం, 2 మే 2023 (10:20 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రత్యర్థి ఖైదీలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన గ్యాంగ్‌స్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిందని జైలు అధికారులు వెల్లడించారు. 
 
తీహార్ జైలులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హై రిస్క్‌ వార్డ్‌లో ఉన్న టిల్లు తాజ్‌పురియా అలియాస్‌ సునిల్‌ మాన్‌పై మరో గ్యాంగ్‌స్టర్‌ యోగేశ్‌ తుండా, అతడి అనుచరులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. జైలు అధికారులు గమనించి దాడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టిల్లును హుటాహుటిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగాద టిల్లు తాజ్‌పురియా ఢిల్లీలోని అత్యంత క్రూరమైన క్రిమినల్‌ గ్యాంగ్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. 2015లో ఓ కేసులో అరెస్టయి అప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉంటున్నాడు. టిల్లు గ్యాంగ్‌కు ఢిల్లీకి చెందిన మరో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగితో ఏళ్ల తరబడి శత్రుత్వం ఉంది. ఈ గ్యాంగ్ ముఠా సభ్యులో ఈ హత్యకు పాల్పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు