అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రిలోని అత్యవసర సేవల చికిత్సా విభాగంలో చేర్చి వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెపుతున్నప్పటికీ.. అన్నాడీఎంకే శ్రేణులు తీవ్రఆందోళనలో ఉన్నారు. పైగా, ఆపోలో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
కాగా, గత సెప్టెంబరు నెల 22వ తేదీన అనారోగ్యానికి గురైన జయలలిత అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం బాగుపడటంతో సాధారణ వార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయుకు తరలించారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు.
* పలువురు మంత్రులు, నేతలు, అధికారులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.
* అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులు అపోలో వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
* అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ.
* ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ముంబై నుంచి చెన్నైకు హుటాహుటిన బయలుదేరారు.