కావేరీ పర్యవేక్షక కమిటీ రోజుకు 3 వేల క్యూసెక్కులు వదలాలని సూచించగా, దాన్ని రెట్టింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని ఆయన కోరారు.
కాగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే అంశంపై సిద్ధరామయ్య తమ సహచర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది.