వైఎస్ సేవలు ఎన్నటికీ మరువలేనివి: సోనియా

శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (16:17 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు.. పార్టీకి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. వైఎస్ పార్థివశరీరానికి ఆమె శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీసులో అంజలి ఘటించారు. అనంతరం ఆమె ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మిని పరామర్శించి, ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆమె సందర్శకుల పుస్తకంలో తన సంతాపాన్ని రాశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి రాత్రింబవుళ్లు చేసిన కృషి ఎల్లపుడూ స్ఫూర్తిదాయకమని ఆమె సంతాప సందేశంలో పేర్కొన్నారు.

వైఎస్ బాలల సంక్షేమం, మహిళా సాధికారిత, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డారన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా, పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేశారని, వాటిని ఎన్నటికీ మరువలేమని సోనియా పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి