హైదరాబాద్‌ను ఉమ్మడిగా చేస్తే సమస్యకు చెక్: జయేంద్ర

శుక్రవారం, 7 జనవరి 2011 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే సరిపోతుందన్నారు.

ఆయన శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేయాలని కేంద్ర తుది నిర్ణయం తీసుకుంటే పనిలోపనిగా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచించారు. గతంలో సమైక్యాంధ్రగానే రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించి వివాదాస్పదంగా మారిన జయేంద్ర సరస్వతి ఇప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలంటూ సూచించడం గమనార్హం.

ఇకపోతే. అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. రాజకీయ కారణాల వల్లే ఈ ఆలయ నిర్మాణంలో జాప్యం నెలకొందన్నారు. అయితే రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది దేశంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ మంత్రి కేవలం ఒక్క రాజానే అక్రమాలకు పాల్పడలేదని, దీనివెనుక అనేక మంది హస్తం ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి