తెలంగాణా సమస్య.. కార్తీకం పోయింది... జాతీయం వచ్చింది!!

శుక్రవారం, 11 నవంబరు 2011 (16:17 IST)
కార్తీక పౌర్ణమి తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న గులాంనబీ ఆజాద్ తిరిగి మరో కొత్త మాట చెపుతున్నారు. తెలంగాణపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో చర్చలు ముగిశాయన్నారు.

ఐతే కొత్తగా మరో వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణపై రాష్ట్రస్థాయిలో మాత్రమే చర్చలు పూర్తయ్యాయనీ, ఇక మిగిలింది జాతీయస్థాయిలోనని అన్నారు. జాతీయస్థాయిలో చర్చించిన పిదప ఒక నిర్ణయానికి వస్తామన్నారు.

అంతేతప్ప ఇప్పటికిప్పుడు తెలంగాణపై ఎటువంటి ప్రకటన చేయజాలమని చెప్పారు. మొత్తమ్మీద తెలంగాణ సమస్య మరికొంతకాలం సాగుతుంద్నమాట.

వెబ్దునియా పై చదవండి