రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో నివశించే సీమాంధ్ర ప్రజల హక్కులను తాము కాపాడుతామంటూ ఆయన భరోసా ఇస్తున్నారు.
రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో నివసించే వారిని తాము కాపాడతామంటే తాము కాపాడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని ఆయన అన్నారు.
మన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నపుడు లేని ఇబ్బంది హైదరాబాద్లో నివసించే వారికి ఎందుకు రావాలని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అయితే, సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను తాము కాపాడుతామని చెప్పారు.