టి నోట్‌కు సోనియా గ్రీన్‌ సిగ్నల్ : షిండే సంతకం

గురువారం, 3 అక్టోబరు 2013 (16:43 IST)
File
FILE
టి నోట్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి రాజకీయ అనుమతి లభించింది. దీంతో తెలంగాణ నోట్‌పై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సంతకం చేసినట్టు సమాచారం. ఈ నోట్ ప్రతులను కేంద్ర మంత్రులకు కూడా అందజేశారు.

తెలంగాణ నోట్ గురువారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందనే వార్తలను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం ఉదయం కొట్టిపారేశారు.

తెలంగాణ నోట్‌పై మంత్రివర్గంలో చర్చ జరుగుతుందనే వార్తలు ఊహాగానాలేనని ఆయన అన్నారు. అయితే, అంతర్గతంగా మాత్రం అన్ని పనులు శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి