ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా యూపీ సీఎంను కలిశారు. కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు.
జూన్ 27న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే.