34వ జాతీయ క్రీడలకు ఆతిధ్యమివ్వనున్న జార్ఖండ్‌

గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న 34వ జాతీయ క్రీడలకు ఎట్టకేలకు ముహుర్తం, వేదిక ఖరారయ్యాయి. 34వ జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 ముహుర్తం ఖరారు చేయగా.. ఈ క్రీడలకు జార్ఖండా వేదికగా మారనుంది.

గత 2007 నుంచి వాయిదా పడుతూ వస్తున్న 34వ జాతీయ క్రీడలు జార్ఖండ్‌లో ఫిబ్రవరి 12, 2011 నుంచి ఫిబ్రవరి 26, 2011 వరకూ జరగున్నాయని జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా తెలిపారు. రాంచీలో జరిగిన జాతీయ క్రీడల నిర్వాహక సంఘం (ఎన్‌జిఓసి) సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముండా విలేఖరులకు తెలిపారు.

"వివిధ కారణాల వల్ల గత 2007లో జరగాల్సిన జాతీయ క్రీడలు వాయిదా పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈ తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోద"ని ముండా స్పష్టం చేశారు. ఈ క్రీడలు ఘనంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి