చెరువు వద్ద అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్... కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితులు (Video)

ఠాగూర్

ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి చెరువును ఆక్రమించుకుని అక్రమంగా నిర్మించుకున్న గృహాలపై హైడ్రా బుల్డోజర్ ప్రయోగిస్తుంది. చెరువు ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్‌‍ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఆదివారం ఉదయం నుంచి ఈ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించింది. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 
కూకట్‌పల్లి నల్ల చెరువు వద్ద ఉన్న నిర్మాణాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎటువంటి నోటీసు లేకుండా కూల్చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల రూపాయలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్న ఓ బాధితుడు బోరున విలపిన్నాడు. అయితే, కొందరు బాధితులు మాత్రం కూల్చివేతలకు కొంత సమయం ఇవ్వాలంటూ కోరుతున్నారు. 

 

కూకట్‌పల్లి నల్ల చెరువు వద్ద నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేస్తున్న హైడ్రా

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితులు

ఎటువంటి నోటీసు లేకుండా కూల్చేస్తున్నారు అని ఆరోపిస్తున్న బాధితులు

కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేస్తున్నారని ఆవేదన

50 లక్షల రూపాయలు పెట్టి ఫుడ్… pic.twitter.com/8qHMZX1Rwq

— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు