గజ్వేల్ నుంచి కేసీఆర్‌తో పోటీకి సై అంటోన్న ఈటెల జమున

మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:29 IST)
KCR_Jamuna
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సోమవారంతో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు అందాయి. 
 
చివరిరోజు సోమవారం 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు.
 
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు