కాకతీయ సామ్రాజ్య విస్తరణతో పాటు వైభవాన్ని దశదిశలా చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించిన ఆసక్తికర అంశం బయటికొచ్చింది. ఇప్పటివరకూ ఆమె మరణానికి సంబంధించి ఉన్న అభిప్రాయాలు తప్పన్న విషయాన్ని చెప్పే సాక్ష్యం బయటకు వచ్చింది. రుద్రమదేవికి సంబంధించిన మరణశాసనం ఒకటి తాజాగా గుర్తించారు. ఇప్పటివరకూ రాణి రుద్రమదేవి క్రీస్తు శకం 1296లో మరణించినట్లుగా చెప్పేవారు.