వేశ్య పాత్రలో ప్రియమణి.. పెళ్ళికి తర్వాత కూడా మంచి రోల్స్ వస్తే నటిస్తుందట..

గురువారం, 6 అక్టోబరు 2016 (11:49 IST)
ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ''మన ఊరి రామాయణం''. ప్రకాశ్‌రాజ్ సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రియమణి వేశ్య పాత్రలో నటించింది. ఈ మూవీలో ప్రియమణి పాత్ర కీలకంగా ఉంటుందని దర్శకనిర్మాత ప్రకాష్ రాజ్ అంటున్నారు. 
 
తన పాత్రను ప్రకాష్ రాజ్ విభిన్నంగా తీర్చిదిద్దాడని ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో వివరించింది. ఇదేసందర్భంలో తన మతాంతర వివాహం గురించి కూడా ప్రియమణి స్పందించింది. కొంతమంది ఈ విషయంలో తనను విమర్శించినా తనకు నష్టం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయిందని, వచ్చే యేడాది వివాహం ఉంటుందని, తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆమె తెలిపింది. మంచి పాత్రలు వస్తే విహానంతరం నటిస్తానంది. కాగా దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వెబ్దునియా పై చదవండి