పెద్ద నోట్ల రద్దు అంశంతో పాటు.. మార్పిడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిందనీ, సినిమాలకు ఇది వర్తించకుండా కాస్త వెసులుబాటు ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం విడుదల ఆలస్యమైనా కోట్లు ఖర్చుపెట్టి నిర్మాత తీశారు.
అప్పటికే ఓవర్సీస్ ప్రింట్లు కూడా వెళ్లిపోయాయి. ముందుగా అనుకున్నడేట్ ఈనెల 11న. కానీ అప్పటికి మూడురోజుల ముందే మోడీ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్ళురాలేదు. అందరూ నోట్లను వెతుక్కోవడంతోనే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంకా వినోదం కోసం సమయాన్ని కేటాయించే వ్యవధి వారికి లేదు. ప్రభుత్వానికి వినోదపు పన్నుకూడా కడుతున్న నిర్మాతల కష్టాలను చూడాలని ఆయన కోరారు.