మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

ఠాగూర్

శనివారం, 24 మే 2025 (13:01 IST)
మా డాడీ మంచు మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని వుందని, తన కుమార్తెను ఆయ మడిలో కూర్చోబెట్టాలని ఉందని హీరో మంచు మనోజ్ అన్నారు. తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన తాజాగా స్పందించారు.
 
"తొమ్మిదేళ్లుగా నా పని నేను చేసుకునిపోతున్నా. నా భార్య బొమ్మల తయారీ కంపెనీ ప్రారంభించింది. దానికి నేను ఆర్ట్ వర్క్ చేశా. కథలు రాశా. ఆత్మగౌరవంతో బతికా. నేను ఎలాంటివాడినో ఇండస్ట్రీలోనే కాదు బాహ్య ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, నాకు ఊహించని విధంగా ముప్పు ఎదురైంది. నిస్సహాయస్థితిలో ఉన్న కారణంగానే మీడియా ముందుకు వచ్చా. నా సతీమణి గర్భంతో ఉన్న సమయంలో మళ్లీ కలిశాం. అది మా కుటుంబంలోని ఒకరికి నచ్చలేదు. 
 
మరోవైపు, కాలేజీలోని కొన్ని సమస్యలు గురించి పెద్దాయన వరకూ వెళ్ళడం లేదంటూ కొందరు విద్యార్థులు నాకు లేఖలు ఇచ్చారు. ఇది తెలుసుకున్న ఆ వ్యక్తి... నీకేంటి సంబంధం? అనే మాట వచ్చింది. ఆ తర్వాత అక్కడ పనిచేసేవారితో కలిసి నాపైనా, నా భార్యపైనా కేసులు పెట్టించారు. సంబంధం లేదని విషయంలో నా భార్యను లాగారు. అపుడు నా హృదయం ముక్కలైంది. తనకు అన్నీ నేనే. నేను ఏ తప్పూ  చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. గొడవ పెట్టుకోలేదు. నాకు ఆవేశం ఉది. 
 
బాధతో వచ్చిన కోపం అది. వెళ్లి నాన్న కాళ్ళుపట్టుకోవాలని వుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా.. మా మాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను. మేమంతా మళ్లీ కలిసివుండే రోజు రావాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నా.. సమస్యలు సృష్టించినవారు తమ తప్పును తెలుసుకుంటారనే నమ్మకం ఉంది" అని మంచు మనోజ్ తన మనసులోని బాధను వెళ్లగక్కారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు