మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మెగా 157 చిత్రం షూటింగ్ ముస్సోరీలో పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. చిరంజీవి ఫోన్ మాట్లాడుతుండగా, నయనతార పూలతో ఆయన్ను చూస్తూ ఏదో చెప్పబోతున్న సీన్ ను బ్లర్ చేస్తూ, వారికి టేక్ చెబుతున్నట్లుగా కెమెరాతో దర్శకుడు చూస్తున్న ఈ స్టిల్ తో షూటింగ్ ముగిసినట్లు తెలిపారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా మేకర్స్ ముస్సోరీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయి.
కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు #Mega157 ప్రతి ప్రమోషనల్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే ముస్సోరీ షెడ్యూల్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్లో అలరించారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.