హేమనాథ్ అలాంటి పని చేస్తున్నాడు.. బుల్లితెర నటి చిత్ర తండ్రి ఫైర్

బుధవారం, 16 ఆగస్టు 2023 (14:51 IST)
కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర 2020లో తిరువళ్లూరులోని నజరేత్ పేటలోని ఓ స్టార్ హోటల్‌లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చిత్రను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భర్త హేమ్‌నాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తిరువళ్లూరు మహిళా ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును చెన్నైకి బదిలీ చేయాలని, కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాలని చిత్ర తండ్రి కామరాజ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. విచారణలో పురోగతి లేదని చిత్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే హేమ్‌నాథ్‌ కేసును జాప్యం చేయాలంటూ 2021 నుంచి పలు పిటిషన్లు వేస్తున్నారని పిటిషన్‌లో చిత్ర తండ్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఛార్జిషీటు నమోదు చేసే దశలో ఉంది. అంతే కాకుండా వయోభారం కారణంగా కేసు విచారణ నిమిత్తం తిరువళ్లూరు వెళ్లడం కష్టమని, అందుకే కేసును తిరువళ్లూరు నుంచి చెన్నైకి బదిలీ చేయాలని అభ్యర్థించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు