బ్రెయిన్‌డెడ్ -22 ఏళ్ల యువకుడి అవయవదానం.. నలుగురికి ప్రాణం పోసింది..

శుక్రవారం, 21 జులై 2023 (12:20 IST)
విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌లో బ్రెయిన్‌డెడ్‌కు గురైన 22 ఏళ్ల యువకుడి అవయవదానం నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించింది. వుజ్జూరి దినేష్ తన బైక్‌పై వెళుతుండగా విషాదకరంగా ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైంది. వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినప్పటికీ, దినేష్ ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపించలేదు. అతని బ్రెయిన్ డెడ్‌ అని వైద్యులు ప్రకటించారు. 
 
అయితే దుఃఖంలో ఉన్న అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగలక్ష్మిల నుండి అంగీకారంతో దినేష్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అవయవదానం జరిగింది. ఈ అవయవ దానంతో విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో రోగులకు కాలేయం, ఒక కిడ్నీ దానంగా ఇవ్వడం జరిగింది. అదనంగా, అతని కళ్లను ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి దానం చేశారు. ఇది దృష్టిలోపం ఉన్నవారికి ఆశాజనకంగా ఉంది.
 
మరో కిడ్నీని విజయవాడలోని విజయా ఆసుపత్రికి తరలించగా, ఊపిరితిత్తులను మార్పిడి కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. దినేష్ దాతృత్వం నలుగురికి పునర్జన్మ లభించిందని వైద్యులు తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు