తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ : శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

ఠాగూర్

సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:15 IST)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది. ఇది దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. కోట్లాడి మంది శ్రీవారి భక్తులు అవాక్కయ్యారు. ఇటు ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లోనూ పెను దుమారం చెలరేగింది. అయితే, శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ శాంతి హోమాన్ని నిర్వహించనుంది. 
 
ఈ కార్యక్రమంలో తితిదే ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, వేద పండితులు, అర్చకులు పాల్గొంటారు. వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందని ఈవో శ్యామల రావు అన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. హోమం ముగిసిన తర్వాత అన్ని లడ్డూ తయారీ పోటుల్లో కూడా సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు