గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

శనివారం, 16 జనవరి 2021 (19:20 IST)
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకున్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు  శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్‌ రాజ్ కుమార్, వెంక‌టాద్రి,  టెంపుల్ ఇన్సెక్టర్లు‌ కృష్ణమూర్తి, మునీంద్ర‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు